టేక్రియల్ జంక్షన్లో డ్రంక్ అండ్ డ్రైవ్పై ప్రత్యేక తనిఖీలు – ఐదుగురిపై కేసులు నమోదు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి జులై 6 ( వార్త సంధ్య )
ఎస్పీ గారి ఆదేశాల మేరకు దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని టేక్రియల్ జంక్షన్లో ఈరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ను నివారించేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఈ ప్రత్యేక డ్రైవ్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఐదుగురిని గుర్తించి, వారిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్రజల ప్రాణాల భద్రత దృష్ట్యా మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.

