ePaper
Tuesday, May 12, 2026
📄 ePaper
Homeతెలంగాణప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : కలెక్టర్ అంకిత్

ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : కలెక్టర్ అంకిత్

📰 Generate e-Paper Clip

భద్రాద్రి జిల్లా బ్యూరో, ఏప్రిల్ 26 (వార్త సంధ్య) : ఏప్రిల్ 27 వ తేదీ, సోమవారం నాడు కలెక్టరేట్‌లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. ప్రజలు తమ తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక ఫిర్యాదులను సమర్పించాలని సూచించారు. ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. సంబంధిత శాఖాధికారులు ప్రజల నుండి అందిన ఫిర్యాదులను వెంటనే స్వీకరించి, తగిన చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!