ePaper
Saturday, July 11, 2026
📄 ePaper
Homeతెలంగాణధాన్యం కొనుగోళ్లలో రూ.1000 కోట్ల దోపిడీ జరిగింది : మాజీమంత్రి జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి

ధాన్యం కొనుగోళ్లలో రూ.1000 కోట్ల దోపిడీ జరిగింది : మాజీమంత్రి జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి

📰 Generate e-Paper Clip

రైతులు క్వింటాల్‌కు రూ.120 నుంచి రూ.243 వరకు నష్టపోయారని  విమర్శ

ధాన్యం దోపిడీపై వెంటనే విచారణ జరపాలని డిమాండ్

హైదరాబాద్, జూన్ 18 (వార్త సంధ్య): ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తున్నప్పటికీ రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టీ. జీవన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, క్వింటాల్‌కు రూ.120 నుంచి రూ.243 వరకు రైతులు నష్టపోయారని, సుమారు రూ.1000 కోట్ల విలువైన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు దోపిడీ చేశారని ఆరోపించారు.

ధర్మకాంట తూకాల ఆధారంగా విచారణ చేపడితే వాస్తవాలు బయటపడతాయని పేర్కొన్న ఆయన, ప్రభుత్వం వెంటనే సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఈ వ్యవహారం ప్రభుత్వ కనుసన్నల్లోనే జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతాయని అన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి Y. S. Rajasekhara Reddy, తెలంగాణ ఏర్పాటైన తర్వాత మాజీ ముఖ్యమంత్రి K. Chandrashekar Rao రైతాంగానికి అండగా నిలిచారని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో రైతులు సాగులో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ప్రభుత్వం కేవలం ఏడు రకాల పంటలనే సాగు చేయాలని సూచించడం సరైన నిర్ణయం కాదన్నారు.

ఏడు రకాల పంటలకు చీడపీడల సమస్యలు అధికంగా ఉంటాయని, ధాన్యం సేకరణ బాధ్యత నుంచి తప్పించుకునేందుకే ప్రభుత్వం ఈ విధానాన్ని అనుసరిస్తోందని ఆరోపించారు. రబీ సీజన్‌లో బోనస్ ఇవ్వడం కూడా ప్రభుత్వం మరిచిపోయిందని విమర్శించారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు కింద రూ.10 వేలు అందించగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చి రైతులను మోసం చేసిందన్నారు. కనీసం ఈ ఖరీఫ్ సీజన్‌లోనైనా రైతు భరోసా కింద రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

యూరియా పంపిణీ కోసం తీసుకొచ్చిన యాప్ సాధారణ రైతులకు అర్థమయ్యే విధంగా లేదని పేర్కొన్న ఆయన, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఇటువంటి విధానం లేదని అన్నారు. యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

రైతు బీమా పరిహారం కోసం కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని, ప్రభుత్వం రైతు బీమా పరిస్థితిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు ఏ పంట సాగు చేసినా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందనే భరోసాను కల్పించాలని ఆయన కోరారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!