మంత్రి సీతక్కను కలిసి కృతజ్ఞతలు తెలిపిన నేతలు
డీసీసీ ఉపాధ్యక్షుడిగా గంప ప్రసాద్ నియామకంపై అభినందనలు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 29 (వార్త సంధ్య) : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు, కామారెడ్డి జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్కను నాయకులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల కామారెడ్డి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడిగా గంప ప్రసాద్కు అవకాశం కల్పించినందుకు వారు అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ మంత్రి సీతక్కను కలిసి ధన్యవాదాలు తెలిపారు.గంప ప్రసాద్ నియామకం పార్టీ బలోపేతానికి దోహదం చేస్తుందని వారు పేర్కొన్నారు.