Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 16 March 2026, 5:34 pm Posted by : VARTHA SANDHYA DESK

దుబ్బాకలో విద్యార్థులకు అగ్నిప్రమాదాలు, ప్రకృతి విపత్తులపై అవగాహన

  • మాస్టర్ మైండ్స్ స్కూల్‌లో అవగాహన కార్యక్రమం

  • అగ్నిమాపక సిబ్బంది విద్యార్థులకు ప్రాయోగిక శిక్షణ

  • విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు

దుబ్బాక ప్రతినిధి, మార్చి 16 (వార్త సంధ్య): సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని ది మాస్టర్ మైండ్స్ స్కూల్‌లో సోమవారం అగ్నిమాపక సిబ్బంది మరియు ప్రకృతి విపత్తుల నివారణ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.వేసవికాలంలో సంభవించే అగ్ని ప్రమాదాలను ఎలా నివారించాలి, అలాగే వరదలు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో మనల్ని మనం మరియు మన చుట్టూ ఉన్న వారిని ఎలా రక్షించుకోవాలో అగ్నిమాపక సిబ్బంది నరేష్ తమ బృందంతో కలిసి విద్యార్థులకు వివరించారు.ఈ సందర్భంగా అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు ప్రయోగాత్మకంగా చూపిస్తూ అవగాహన కల్పించారు. ప్రమాదం సంభవించినప్పుడు భయపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణనష్టం తగ్గించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎర్రోళ్ల హరిబాబు, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థిని–విద్యార్థులు పాల్గొన్నారు.