రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన సాగుతోంది: మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్
సింగూరు జలాశయంలో భూకబ్జాలపై విచారణ జరిపి అనిల్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్.. బీఆర్ఎస్ కార్యకర్తలపై వేధింపులు ఆపాలని హెచ్చరిక హైదరాబాద్, తెలంగాణ భవన్: రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు రైతుల్లో ఉన్న ఆదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్నాయని, వాటి ధరలు...