Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 08 June 2026, 11:54 am Posted by : జడల నాగప్రసాద్

అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేతిరెడ్డి శకుంతల రెడ్డి బాధ్యతల స్వీకారం

భద్రాద్రి జిల్లా బ్యూరో, జూన్ 08 (వార్త సంధ్య) : అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేతిరెడ్డి శకుంతల రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సేవాదళ్ ప్రతినిధులు, మహిళా నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త బాధ్యతలను స్వీకరించిన అనంతరం శకుంతల రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు మరియు సేవాదళ్ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. పార్టీ బలోపేతానికి, మహిళలు మరియు యువత రాజకీయంగా మరింత ముందుకు రావడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. సేవాదళ్ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ, శకుంతల రెడ్డికి అప్పగించిన బాధ్యతలతో సంస్థ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సేవాదళ్ కార్యకలాపాలను విస్తృతం చేసి, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, సేవాదళ్ రాష్ట్ర, జిల్లా ప్రతినిధులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొని శకుంతల రెడ్డిని ఘనంగా సన్మానించారు.